నీలోఫర్ లో ఒకే కాన్పులో నలుగురు పిల్లలు

నీలోఫర్ లో ఒకే కాన్పులో నలుగురు పిల్లలు
  • తక్కువ బరువు ఉండడంతో శిశువులకు వివిధ చికిత్సలు 
  • 35 రోజులు తర్వాత తల్లి, పిల్లల డిశ్చార్జ్

మెహిదీపట్నం, వెలుగు: ఒకే కాన్పులో మహిళ నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. హైదరాబాద్ లోని హస్తినాపురం ఏరియాకు చెందిన 24 ఏండ్ల గర్భిణి అమృత ఏడు నెలలకే పురిటి నొప్పులతో బాధపడుతూ గత ఫిబ్రవరి 22న నీలోఫర్ ఆస్పత్రిలో చేరింది.  వెంటనే డాక్టర్లు ఆపరేషన్ చేయగా నలుగురు పిల్లలు పుట్టారు. వీరిలో ఇద్దరు మగ, ఇద్దరు ఆడ పిల్లలు.

తక్కువ బరువుతో నెలలు నిండకుండానే జన్మించడంతో శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తగా వెంటిలేటర్ సాయంతో  చికిత్స అందించారు. మొదట్లో నలుగురికి తల్లి పాలివ్వడం ఇబ్బందిగా ఉండడంతో  హ్యూమన్ మిల్క్ బ్యాంకు నుంచి తీసుకొచ్చి పిల్లలకు తాగించారు. 35 రోజుల చికిత్స తర్వాత తల్లి పిల్లలను శనివారం డిశ్చార్జ్ చేసినట్టు నీలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ రవికుమార్, ఎన్ఎన్ హెచ్ఓడీ డాక్టర్ స్వప్న తెలిపారు.